ADB: ఉట్నూర్లోని రామమందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోశ్ దుబే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాశ్చాత్య ధోరణులకు లోనుకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. ఉగాది విశిష్టతను చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.