MLG: ఏటూరునాగారం (M) ముళ్లకట్ట గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో లీకేజీ వల్ల తాగునీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతోంది. DYFI జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్ మాట్లాడుతూ.. ఈ సమస్య వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే లీకేజీని రిపేర్ చేసి నీటి సరఫరా సాఫీగా చేయాలని డిమాండ్ చేశారు. త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.