NDL: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం నందివాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది, దీనికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.