సీబీఎస్ఈ మే నెలలో నిర్వహించే పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల కోసం అభ్యర్థుల జాబితా స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు కొనసాగనుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండుసార్లు చేపట్టనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో మొదటి విడత పరీక్షలు నిర్వహించారు.