KNR: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ఇన్స్పెక్టర్ పున్నం చందర్ తెలిపారు. వేములవాడలో పని చేసిన కాలంలో స్నేహితుడు వేణు యూపీఐ ఖాతా ద్వారా రాము మామూళ్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సోదాల్లో రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.