రేపటి నుంచి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 6.53 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు.