BHPL: మొగుళ్లపల్లి(M) ఇసిపేటలో బుధవారం ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఏ. సునిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వ పథకాల పై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిర మార్కెట్, అధిక దిగుబడి, దీర్ఘకాల ఆదాయం లభిస్తాయని, ఉద్యాన శాఖ సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్, మినీ కిట్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.