MBNR: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎదర గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా BJP రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.