KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 8 వాహనాల్లో 75 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకువచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,500, కనిష్ఠంగా రూ. 7,200 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా పత్తిని కొనుగోలు చేశారు. నిన్నటి కంటే తాజాగా పత్తి గరిష్ఠ ధర రూ. 50 పెరిగింది. రైతులు నాణ్యత పాటించాలన్నారు.