KMM: బోనకల్ రైతు వేదికలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో సీడీపీఓ బాల త్రిపుర సుందరి మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా, సైబర్ నేరాలు, బీఎన్ఎస్, ITPA, POCSO చట్టాలు, 1098, 1930, 100 టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించారు. ప్రేమ, పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మహిళలను వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని తెలిపారు.