NDL: రంజాన్ సందర్భంగా డోన్ ఐద్వా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు షేమిమ్ బేగం మాట్లాడుతూ రంజాన్ పండుగ సేవాభావానికి ప్రతీక అని, పేదలతో ఈ ఆనందం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఐక్యత పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.