JN: ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలంలోని రంగాపురం, లక్ష్మక్కపల్లి గ్రామాల ముఖ్య నేతలతో ఝాన్సీరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.