నల్గొండ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే పండుగ ఉగాది అన్నారు.