NGKL: లింగాల మండలం వడ్డె రాయవరం గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని సర్పంచ్ పబ్బతి శ్రీను యాదవ్ బుధవారం నెరవేర్చారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని తీరుస్తానని మాట ఇచ్చిన మేరకు, తాజాగా కొత్త తాగునీటి బోరును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పస్పుల శివయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.