E.G: చాగల్లులో ఇవాళ నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరి బాబు, తదితరులు పాల్గొన్నారు.