VSP: వైసీపీ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలిగా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.