ELR: ఉంగుటూరు (M) కైకరం సుందర సీతారామస్వామి కళింగ రామాలయంలో భక్తులు సమకూర్చిన రూ. 5 లక్షలపైగా విరాళాలతో రూపొందించిన ఆష్ట భుజి టేకు రథం ఈనెల 21న సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త కూన అప్పారావు బుధవారం తెలిపారు. కర్ణాటకలోని కుంట పట్నానికి చెందిన కుంట హస్త కళా సంస్థ ఈ దివ్య రథ నిర్మాణం చేశారని పేర్కొన్నారు.