KRNL: కర్నూలు జిల్లా విశ్రాంత జాయింట్ కలెక్టర్-2 ఎస్. రామస్వామి బుధవారం మృతి చెందారు. 2022లో పదవీ విరమణ పొందిన ఆయన, గతంలో జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రామస్వామి మృతికి జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పరిపాలనలో ఆయన అందించిన విశేష సేవలను పలువురు కొనియాడారు.