JN: రైతు భరోసా పథకం దరఖాస్తుల విషయంలో రైతులు మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ హెచ్చరించారు. గ్రామ వ్యవసాయ అధికారులకు నేరుగా వివరాలు సమర్పించాలని, బ్యాంకు ఖాతా, ఆధార్, భూమి వివరాల్లో తప్పులు లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. రైతులందరికీ సమయానికి రైతు భరోసా లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.