ప్రకాశం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పుల్లలచెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కాపురం DSP నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దొంగిలించిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.