గుంటూరు: ఆర్టీసీ బస్టాండ్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగుల సహాయకులకు 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు సదరం, ధ్రువపత్రాల కాపీ వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.