MLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ములుగు (M) కాశీందేవిపేట గ్రామంలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛతకు సహకరించి, చెత్తను సరైన చోట వేయాలని, గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.