WNP: నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. కొత్తకోట మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి పనులు చేసి వారి అభిమానాన్ని చురగుంటే నాయకుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.