NGKL: ఉన్నత చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు అండగా ఉంటామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం పర్వతాయపల్లికి చెందిన సాంబ కవిత అనే విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసంలో ఆమెకు ల్యాప్ టాప్ అందజేశారు.