RR: హయత్ నగర్ డివిజన్లోని దత్తాత్రేయ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన హయంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వర్షాకాలానికి ముందుగానే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.