SRPT: హుజూర్నగర్ క్యాంపు హైస్కూల్లో నేడు మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు ముగిశాయి. ఎంఈవో సైదా నాయక్, హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో 22 మంది బాలురు, 18 మంది బాలికలు పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పాల్గొన్నారు.