NRPT: యువకులు ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య హెచ్చరించారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తాలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడిపించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు.