KMR: బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం ఉదయం నుంచి జిల్లా ఓఎన్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాబా, టీ పాయింట్, హోటలలో డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నట్టు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 16 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎనిమిది మంది హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.