NZB: రైతు భరోసా పథకానికి ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సిరికొండ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. రైతు భరోసా అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలతో రైతు వేదికల్లో AEOకు ఇవ్వాలన్నారు. 28.02.2026 వరకు కొత్త పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.