KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.