CTR: రానున్న ఉగాది, రంజాన్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కుప్పం DSP పార్థసారథి సూచించారు. రామకుప్పంలో మంగళవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అందరూ సహకరించి సోదర భావంతో పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సైలు పాల్గొన్నారు.