NLG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.