NZB: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 21న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. మంగళవారం BJP జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వానికి కలెక్టరేట్ ముట్టడి తమ సమాధానమన్నారు.