MDK: జిల్లాలో పదో తరగతి ఫలితాల సాధన కోసం 99 రోజుల ప్రణాళికపై డీఈవో విజయ సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు గైర్హాజరయ్యే విద్యార్థులను క్లస్టర్ స్థాయిలో గుర్తించి, వారు హాజరయ్యేలా ప్రోత్సహించాలని సీఆర్పీలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో సుదర్శన మూర్తి, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.