NTR: నందిగామలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ అధిక వేగంతో వెళ్తున్న విద్యార్థులను ఆపి ట్రాఫిక్ ఎస్సై నరేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పరీక్షల అనంతరం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. తల్లిదండ్రుల కష్టం గుర్తుంచుకుని బాధ్యతగా ఉండాలని సూచించారు.