TPT: శ్రీసిటీ పరిధిలోని LG పరిశ్రమ వద్ద కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోజూవారి కూలీ పనులకు వచ్చిన వీరు కాపర్ వైర్లను దొంగిలించినట్లు తెలిపారు. LG పరిశ్రమ HR ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీసిటీ పోలీసులు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నారు. రూ.2.30 లక్షల విలువైన రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.