MBNR: జిల్లా నూతన కలెక్టర్ ఖుష్బూ గుప్తాను MUDA ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, నగరాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో నిలపాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ని కోరారు.