ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్ను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డా. ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, నీటి వసతులు ఇతర సమస్యల గురించి ఆరా తీశారు. తరగతి గదులు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో RO ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.