WGL:నల్లబెల్లి (M) కేంద్రంలోని శనిగరం జాతీయ రహదారి వద్ద సోమవార అర్ధరాత్రి SI గోవర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువకుల వద్ద నుండి 951 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు SI పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.