కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. లారీ డ్రైవర్తో పాటు యాజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.