TG: వరంగల్ కేయూలో పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. సీనియర్లు దొంగతనం నెపం మోపారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేయగా.. నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీవిద్య స్వస్థలం ఖమ్మం జిల్లా బనిగండ్లపాడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.