ELR: ముసునూరు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. హెల్మెట్ ధారణ తలకు భారం కాదని, కుటుంబానికి రక్షణ కవచం అనే నిజాన్ని గుర్తించాలన్నారు. హెల్మెట్ లేని వాహన చోదకులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు.