యూపీ మొరాదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఢిల్లీ హైవేపై ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చి ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా మొరాదాబాద్ నివాసితులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.