సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఈనెల 20న శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త ఈశ్వరయ్య సోమవారం మండల ఎస్సై రమేశ్ బాబును మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. జ్యోతుల మహోత్సవం వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయనను కోరారు.