NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు దేశమోని పరశురాముడు ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.