MHBD: గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శనివారం అర్థరాత్రి తవ్వకాలు చేశారు. సీతానగరం గ్రామ యువకులు ఆ వ్యక్తులను ఆరా తీశారు. వారు పోంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు అటవీశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేలోపో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.