TPT: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టిశ్రీరాములు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ మౌర్య, టీడీపీ ముఖ్య నేతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.