RR: కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ ఉప సర్పంచ్ అంజయ్య ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పంట నారు కోసం రాయలసీమలోని పెనుగొండకు వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయన ప్రయాణిస్థున్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. ఉప సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.