ATP: వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శిగా నియమితులైన మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి ఇవాళ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శింగనమల సమన్వయకర్త సాకే శైలజానాథ్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.