HYD: సాయిబాబా దేవాలయం ఎదుట ఓ వ్యక్తిని కిరాతకంగా కత్తులతో నరికి చంపిన ఘటన HYD ఉప్పల్ పరిధి చిలుకా నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. కత్తులతో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ వార్త ఉప్పల్ పరిసర ప్రాంత ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కత్తులతో జరిగిన దాడి వెనుక ఎవరున్నారు..? కారణాలేంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.